Title Picture
మాధవీముఖర్జీ

సువర్ణ పతక గ్రహీత సత్యజిత్ రాయ్ 'చారులత'

సత్యజిత్ రాయ్ దర్శకత్వం క్రింద ఆర్.డి.బన్సాల్ నిర్మించిన బెంగాలీ చిత్రం 'చారులత' 1964వ సంవత్సరంలో తయారైన భారతీయ కథా చిత్రాలన్నింటిలో అత్యుత్తమ చిత్రంగా ఎన్నికై, రాష్ట్రపతి సువర్ణ పతకాన్ని గెలుచుకున్నది-ఈ వార్తలో విశేషమేమీలేదు. సత్యజిత్ రాయ్ ప్రతి ఏడాదీ ప్రభుత్వం నుంచి సువర్ణపతకాన్నో, రజతపతకాన్నో, ప్రశంసా పత్రాన్నో అందుకుంటూనే ఉన్నారు. ఆయన సువర్ణ పతకాన్ని అందుకోవటం ఇది మూడవసారి. ప్రభుత్వం చలన చిత్రాలకు బహుమతులు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఇంతవరకు ఒకటి కంటే ఏక్కువ సువర్ణ పతకాలను పొందినవారు మరెవ్వరూ లేరు.